పతంజలి అనగానే మనకు బాబా రాందేవ్, ఆయన చేసే యోగాసనాలతో పాటు ఆ బ్రాండ్కు చెందిన వస్తువులు గుర్తొస్తాయి. అయితే పతంజలి బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్ రానుందన్న వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.
ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.