కల్కి అవతారం ప్రధాన లక్ష్యం ఒక్కటే ధర్మాన్ని కాపాడడం. అతను దుష్టులను శిక్షించి మంచివారిని రక్షిస్తాడు. చెడు పాలకులు, దొంగలు, అన్యాయం చేసే వారి అందరినీ నిర్మూలిస్తాడని పురాణాల వివరణ. దీనివల్ల ప్రపంచం మళ్ళీ పవిత్రంగా మారుతుంది. కలియుగం తర్వాత మరొక కొత్త యుగం ప్రారంభమవుతుంది. అదే సత్య యుగం. ఈ యుగంలో నిజం, ధర్మం, శాంతి ప్రధానంగా ఉంటాయి. కల్కికి చెడును అంతమొందించేందుకు అశ్వత్థామ, హనుమంతుడు సాయం చేస్తారని పురాణాలు వివరిస్తున్నాయి.