Planetary War: సూర్య గురు గ్రహాల మధ్య యుద్ధం.. ఈ 3 రాశుల ఉద్యోగాలకు ముప్పు

Published : Jul 14, 2026, 01:17 PM IST

Planetary War: జ్యోతిషశాస్త్రంలో గ్రహ యుద్ధం అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తారు. జూలై 15, 2026న సూర్యుడు, జ్ఞానానికి కారకుడైన గురువు ఒకే మార్గంలో కలుస్తారు. దీని వల్ల మూడు రాశుల వారికి ఉద్యోగపరంగా తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది.

PREV
13
ధనుస్సు

ధనుస్సు రాశి వారికి అధిపతి గురుడు. కాబట్టి వీరికి గ్రహయుద్ధం సమయంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు.   ఈ గ్రహ యుద్ధం వల్ల వీరి గౌరవం దెబ్బతింటుంది. మీ పై అధికారులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోరు. మీలో విపరీతంగా కోపం రగొచ్చు. మీ పనిని తక్కువ చేసి అంచనా వేసినప్పుడు, మీరు ఆవేశంతో మాట్లాడే మాటలు మీ ఉద్యోగానికే ప్రమాదం తెచ్చిపెడతాయి. ప్రశాంతంగా ఉండటమే మంచిది. సరైన ఆధారాలు లేకుండా ఎవరితో ఏమీ మాట్లాడకండి.

23
మీనం

మీన రాశి వారికి కష్టకాలమనే చెప్పాలి. జూలై 15న వచ్చే గ్రహ యుద్ధం వల్ల ఉద్యోగం చేసే చోట పై అధికారుల వైఖరి కఠినంగా మారుతుంది. ఈ రాశి వారు ఎంత కష్టపడినా, వారు దాన్ని తక్కువ చేస్తూనే ఉంటారు.  ఈ రాశివారికి అనవసరమైన ఒత్తిడి మానసిక స్థైర్యాన్ని పరీక్షిస్తుంది. ఉద్యోగం మానేద్దామా అనే ఆలోచన రావచ్చు, కానీ అలాంటి నిర్ణయాలు తీసుకునే సమయం ఇది కాదు.

33
మిథునం

మిథున రాశికి ఈ గ్రహ యుద్ధం వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే చోట వాగ్వాదాలు జరగవచ్చు. దీని వల్ల సమస్యలు మొదలవుతాయి. ఈ రాశివారు చెప్పే విషయాలను  పై అధికారులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈమెయిల్స్, రిపోర్టులు, మీటింగ్‌లలో అజాగ్రత్తగా ఉంటే అది ఈ రాశి వారి కెరీర్‌కే ముప్పుగా మారవచ్చు. కొన్ని రోజులు మాట్లాడటం కంటే వినడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు పై అధికారుల నుంచి అనుమతి తీసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories