వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది కేవలం ఒక ఖగోళ సంఘటన కాదు, ఇది రాశులను ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ రాశికి చెందిన వ్యక్తి జీవితం, చుట్టూ ఉన్న పరిస్థితులపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. గ్రహాలు సంచార సమయంలో ఒకదానితో ఒకటి కలిసినప్పుడు, వివిధ యోగాలు ఏర్పడతాయి. అలాంటి ఒక యోగమే ఫిబ్రవరి చివరి నాటికి ఏర్పడబోతోంది. దీనిని అంగారక యోగం అంటారు. దీని వల్ల కొన్ని రాశుల వారికి నష్టాలు తప్పకపోవచ్చు. ఫిబ్రవరి చివరి నాటికి కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే రాహువు అక్కడ ఉంటాడు. దీని వల్ల కుజ, రాహువుల కలయిక జరుగుతుంది. ఇది అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ కలయిక ప్రభావం కొన్ని రాశుల వారికి ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.