జ్యోతిషశాస్త్రంలో శని చాలా శక్తివంతమైన గ్రహం. ఏలినాటి శని, దైయా ప్రభావాలను కలిగించే శని గ్రహం అంటే ఎంతో మంది భయం కూడా. శని రాశులలో చాలా నెమ్మదిగా కదులుతూ ప్రయాణిస్తాడు. ఒక రాశి నుంచి ప్రయాణం మొదలుపెట్టాక తిరిగి అదే రాశికి చేరుకునే సరికి ఏకంగా 30 ఏళ్లు పడుతుంది. శని ఉదయం, అస్తమయం వంటి కూడ రాశి చక్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మార్చి 13 నుంచి శని దేవుడు అస్తమిస్తున్నాడు. శని అస్తమయం కొన్ని రాశుల వారికి ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది.
ఏదైనా గ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు ఆ స్థితిని అస్తమయంగా చెప్పుకుంటారు. జ్యోతిషశాస్త్రంలో శుక్ర, గురు గ్రహాల అస్తమయాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ సమయంలో, పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలు చేయరు. సూర్యుని తీవ్రమైన ప్రకాశానికి గురైన గ్రహాల శక్తి ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ఆ గ్రహాలు అస్తమించాయని అంటారు. మార్చిలో శని దేవుడు అస్తమించబోతున్నాడు. దీనివల్ల మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.