జోతిష్యశాస్త్రం ప్రకారం, 2026 మాఘ పూర్ణిమ పండగను ఫిబ్రవరి 1 ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున చంద్రుని సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. జోతిష్యం ప్రకారం చంద్రుడు మనస్సుకు కారకుడైన గ్రహం. అందువల్ల, ఈ రోజున ప్రజలు తమ మనసును అదుపులో ఉంచుకోవడం అవసరం. ఈరోజున మానసికంగా మనస్సులో చాలా ఒడిదుడుకులు ఎదురౌతాయి. అందువల్ల, ఈ మాఘపౌర్ణమి రోజున నాలుగు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. ఈ రాశులవారు ఆర్థికంగా, ఉద్యోగపరంగానూ,ఆరోగ్య పరంగా చాలా సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. మరి, ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..