Vaishakha Purnima: రాహు నక్షత్రంలో చంద్రుడు..ఈ రాశులకు విజయం నడుచుకుంటూ వస్తుంది

Published : Apr 28, 2026, 07:11 PM IST

Vaishakha Purnima: వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడు రాహువు నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల  నాలుగు రాశులకు విపరీతమైన రాజయోగం పట్టనుంది. అన్ని అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. 

PREV
15
వైశాఖ పౌర్ణమి...

జోతిష్య శాస్త్రం ప్రకారం మే1వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున 2:16 గంటలకు చంద్రుడు రాహువు అధిపతిగా ఉండే స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.  మే 2 వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. పౌర్ణమి రోజున చంద్రుడు ఈ నక్షత్ర మార్పు.. నాలుగు రాశుల వారికి శుభాలు మోసుకురానుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి,  ఆ లాభాలు పొందే ఆ రాశులు ఏంటో చూద్దాం….

25
మిథున రాశి...

వైశాఖ పౌర్ణమి రోజున ఈ చంద్ర సంచారం మిథున రాశివారికి శుభాలు మోసుకురానున్నాయి. ఈ సమయంలో  ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కలగనున్నాయి. శుభవార్తలు వింటారు. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆనందం రెట్టింపు అవుతుంది. కుటుంబంతో ఎక్కువ సమయం సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో వ్యాపారాలకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా.. మంచి విజయాలు అందుకుంటారు. 

35
కర్కాటక రాశి...

కర్కాటక రాశివారికి చంద్రుడు నక్షత్ర మార్పు సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు.  కోర్టు సంబంధిత విషయాలు  ఉపసమనం కలిగిస్తాయి.  తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కారమౌతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. 

45
సింహ రాశి..

విశాఖ పౌర్ణమి రోజున చంద్రుని సంచారం సింహ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.  కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. 

55
కుంభ రాశి...

పౌర్ణమి రోజున రాహువు కుంభ రాశిలోకి అడుగుపెడతాడు. ఈ సమయంలో ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు.  విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో ఏవైనా గొడవలు ఉంటే అవి పరిష్కారమౌతాయి.  మానసిక ప్రశాంతత లభిస్తుంది.  ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories