వేద జోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని, నక్షత్రాన్ని మారుస్తుంది. ఇలా మారిన ప్రతిసారీ అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. తొమ్మిది గ్రహాలలో బుధ, గురు గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.గురు గ్రహం సంపద,అదృష్టం, వివాహం, విద్య, మతం, అదృష్టం, పిల్లలు, శ్రేయస్సు, దాతృత్వానికి మార్గదర్శక శక్తిగా పరిగణిస్తారు. ఇక బుధ గ్రహం..తెలివితేటలు, వాక్చాతుర్యం, కమ్యూనికేషన్ కి ప్రతీకగా పరిగణిస్తారు. జనవరి 31వ తేదీన ఈ రెండు గ్రహాలు 150 డిగ్రీల కోణంలో కలవనున్నాయి. ఇది మూడు రాశుల వారికి చాలా ప్రయోజనాలను తీసుకురానుంది. అదృష్టం కూడా రెట్టింపు కానుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా...