Lord Shiva: మహాశివరాత్రి నాడు భక్తులు శివుని ప్రత్యేక ఆశీస్సుల కోసం పూజలు చేస్తారు. శివుడికి ఇష్టమైనవన్నీ సమర్పిస్తారు. అయితే శివుడు స్మశానంలోని బూడిదను శరీరంపై ఎందుకు పూసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా?
మహాశివరాత్రి వచ్చేసింది. శివ భక్తులంతా తమ ఇష్టదైవాన్ని కొలిచేందుకు సిద్ధమవుతారు. ఇదే శివుని ఆశీస్సులు పొందే సమయం. వేద జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం మహాశివరాత్రి నాడు అనేక శుభకరమైన సంయోగాలు జరుగుతాయి. అందుకే మహాశివరాత్రిని శివ భక్తుల శుభప్రదంగా భావిస్తారు. శివుని రూపం ఇతర దేవతలతో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉంటుంది. దేవతలంతా ధగధగ మెరిసే నగలు, పట్టు వస్త్రాలతో కనిపిస్తారు. మహాదేవుడు మాత్రం బూడిద రాసుకుని కనిపిస్తాడు. స్మశానంలోని బూడిదను ఆయన తన శరీరానికి ఎందుకు పూసుకుంటాడో ఎప్పుడైనా ఆలోచించారా?
24
బూడిద చెబుతున్నదిదే
మత గ్రంథాలు చెబుతున్న ప్రకారం బూడిద అనేది త్యాగాన్ని సూచిస్తుంది. శివుడు భూమిపై పరిస్థితులు చేజారినప్పుడు వినాశకరంగా మారతారు. భూమికి చేటు తీసుకొచ్చే వారిని నాశనం చేస్తాడు. శివుని శరీరంపై ఉన్న బూడిద.. చివరికి ప్రతిదీ బూడిగానే మారుతుందని చెప్పడమే దీని సంకేతం. తన శరీరానికి బూడిద రాసుకోవడం ద్వారా తన భక్తులకు సర్వసుఖాలు, శారీరక సౌందర్యం అన్ని తాత్కాలికమేనని శివుడు చెబుతున్నట్టే. ఆత్మ, సత్యం, మరణం.. ఇవే చివరికి అంతిమ నిజాలు అని ఆయన వివరిస్తున్నట్టే.
34
సొంత భార్య బూడిద
దీనికి సంబంధించి ఒక పౌరాణిక కథ కూడా ఉంది. శివుని భార్య అయిన సతీదేవి ఒక యజ్ఞంలో తనను తాను దహనం చేసుకుంటుంది. ఆమె లేక శివుడు విరహాగ్నితో విలవిలలాడిపోతాడు. ఆమె మృతదేహంతో విశ్వమంతా నాట్యం చేస్తాడు. విష్ణువు భూచక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఆమె బూడిద మాత్రమే శివుడి చేతుల్లో మిగిలిపోతుంది. ఆమె జ్ఞాపకార్థం ఆ బూడిదని తన శరీరానికి పూసుకుంటాడు శివుడు. బూడిద శరీరానికి రాయడం వెనక శాస్త్రీయ కారణం కూడా ఉంది. తీవ్రమైన చలి, వేడి నుంచి బూడిద శరీరాన్ని కాపాడుతుందని నమ్ముతారు. అందుకే యోగులు, సన్యాసులు కూడదా శరీరానికి బూడిద రాసుకుంటూ ఉంటారు.
కేవలం బూడిద మాత్రమే కాదు శివుడికి సమర్పించే కొన్ని నైవేద్యాలు కూడా చేదుగా ఉంటాయి. సముద్రమథనం సమయంలో విషం ఉద్భవించినప్పుడు ఈ ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు దాన్ని తాగి తన గొంతులోనే దాచుకుంటాడు. ఆ విషం వల్ల కలిగే వేడి శివుడి మెదడుకు, శరీరానికి చేరి కాలిపోతాయి. ఆ మెదడును చల్లబరచడానికి దేవతలు అతనికి నీరు, గంజాయి, మారేడు పత్రాలు, ఉమ్మెత్త పువ్వులు వంటి ఔషధ మూలికలను అర్పిస్తారు. అప్పటి నుంచి అవి శివుడికి ప్రియమైనవిగా మారిపోయాయని చెప్పుకుంటారు.