Astrology: గ్రహాల ప్రయాణం రాశులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. కొన్ని గ్రహాల కదలికలు మంచి చేస్తాయి. తాజాగా మిథున రాశిలోకి గురు సంచారం మొదలైంది. దీంతో ఏ రాశుల వారికి కలిసొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల ప్రయాణం రాశులపై పెద్ద ప్రభావం చూపుతుంది. 2025 డిసెంబర్ 5, శుక్రవారం గురు గ్రహం కర్కాటక రాశి నుంచి బయటకు వచ్చి మిథున రాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ మార్పుతో పన్నెండు రాశులపై ప్రభావం కనిపిస్తుంది.
25
గురు స్థానం మార్పు వల్ల కలిగే ఫలితాలు
జ్యోతిష్య నిపుణులు చెబుతున్నట్లు గురు గోచారం సాధారణంగా శుభఫలాలు ఇవ్వగలదు. గురు గ్రహం వక్రంగా ఉన్నా కూడా శుభప్రభావం కనిపిస్తుంది. ఈసారి మిథున రాశిలో గురు ప్రవేశించడం కొన్ని రాశులకు ప్రత్యేక లాభాలు తీసుకురావొచ్చు.
35
మేష రాశికి శుభఫలాలు
ఈ రాశి వారికి ఈ గోచారం అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. పాత పనులు సాఫీగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ధన లాభం ఉండొచ్చు, అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగంలో మార్పు అవకాశంతో పాటు ప్రభావవంతులైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఈ కాలం మంచి ఫలితాలు ఇవ్వొచ్చు. కోర్టు సంబంధిత విషయాల్లో ఉపశమనం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి స్థిరమైన దిశ కనిపించొచ్చు.
గురు గ్రహం మీ రాశిలోకి రావడంతో శుభఫలాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కెరీర్లో కొత్త మార్గం కనిపిస్తుంది. పనిచోట సహకారం పెరుగుతుంది. వేతనం పెరగడం, ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దాంపత్య జీవితంలో అపార్థాలు తగ్గే సూచనలు ఉన్నాయి. కొత్త ప్రారంభాలకు అనుకూల కాలం.
55
సింహ, తుల రాశులపై ప్రభావం
సింహ రాశి వారికి గురు వక్రచలనం ఈ రాశికి మేలు చేస్తుంది. జీవితంలో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, కెరీర్లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లాభాల సూచనలు కనిపిస్తున్నాయి.
తుల రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం, జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.