వైసిపి పాలనలో అదోగతి పాలయిన ఏపీని కాపాడటం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నమ్మి తమతో కలిసి పనిచేయడానికి సిద్దమైన చంద్రబోస్ ను అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఆయనతో పాటు మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసిలు, భారీగా అనుచరులు చేరడంతో కృష్ణా జిల్లాలో టిడిపికి మరింత బలం చేకూరిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిస్తే రాష్ట్రం గెలిచినట్లేనని... అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందని చంద్రబాబు అన్నారు.