అసెంబ్లీ ఎన్నికలపై బాబు ఫోకస్: ఇంచార్జీల నియామకం, 80 స్థానాల్లో అభ్యర్ధుల ఖరారు

Published : Jun 30, 2023, 10:14 AM IST

వచ్చే ఏడాదిలో  జరిగే  అసెంబ్లీ ఎన్నికలకు  చంద్రబాబు ఇప్పటి నుండే  కసరత్తును  ప్రారంభించారు.  ఆయా  నియోజకవర్గాల్లో  పోటీకి  అభ్యర్ధులకు  లైన్ క్లియర్ చేస్తున్నారు.

PREV
19
అసెంబ్లీ ఎన్నికలపై  బాబు ఫోకస్: ఇంచార్జీల నియామకం, 80 స్థానాల్లో  అభ్యర్ధుల  ఖరారు
Chandrababu Naidu

అసెంబ్లీ ఎన్నికలకు  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు  పోకస్ పెట్టారు.  ఖాళీగా  ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు  ఇంచార్జీలను  నియమిస్తున్నారు.  మరో వైపు  ఒకే అసెంబ్లీ స్థానం నుండి పోటీ  పడుతున్న నేతల మధ్య సయోధ్య ప్రయత్నాలు చేపట్టారు. మరో వైపు  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి  మరికొందరు  నేతలకు  చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. 

29
Chandrababu Naidu

ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు  ఇవ్వలేని  నేతలకు  పార్టీ పదవులను  కేటాయిస్తున్నారు.   వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే   నామినేటేడ్ పదవులు  కేటాయిస్తామని తెలుగు తమ్ముళ్లను బుజ్జగిస్తున్నారు. 

39
Chandrababu Naidu


రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో  ఖాళీగా  ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు  ఇంచార్జీల  నియామకంపై  చంద్రబాబు కేంద్రీకరించారు. సామాజిక సమీకరణలను  కూడ  నియామాకాల విషయంలో  చంద్రబాబు  జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

49
narayana

నెల్లూరు అసెంబ్లీకి మాజీ మంత్రి నారాయణను  చంద్రబాబునాయుడు  నియమించారు.మరో వైపు  ఇదే  స్థానంలో పోటీ చేయాలని  భావిస్తున్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి  చంద్రబాబునాయుడు  పార్టీ పదవిని అప్పగించారు.   ఎమ్మెల్సీ పదవిని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి కేటాయించనున్నట్టుగా చంద్రబాబు హామీ ఇచ్చారు.

59
Chandrababu Birthday

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఎస్. కోట  అసెంబ్లీ స్థానం నుండి  మాజీ ఎమ్మెల్యే  కోళ్ల లలిత కుమారికి  చంద్రబాబునాయుడు లైన్ క్లియర్ చేశారు. ఇదే అసెంబ్లీ స్థానం నుండి జి. కృష్ణ ప్రయత్నాలు  చేస్తున్నారు. ఎస్. కోట నుండి  కోళ్ల లలిత  కుమారి  గతంలో ఎమ్మెల్యేగా  ప్రాతినిథ్యం వహించారు. ఈ నియోజకవర్గంలో  కోళ్ల లలితకుమారి,  జి. కృష్ణ వర్గాల మధ్య  ఆధిపత్య పోరు సాగుతుంది.   ఈ పరిణామాల నేపథ్యంలో కోళ్ల లలిత కుమారి   పార్టీ నాయకత్వంపై  అసంతృప్తితో ఉందని ప్రచారం సాగింది. అయితే  ఎస్. కోట  నుండి పోటీకి  కోళ్ల లలిత కుమారికి చంద్రబాబు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

69

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ ఇంచార్జీగా  ఉన్న  బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో మరణించాడు. అర్జునుడు తనయుడు బోస్ ను  టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా  చంద్రబాబు నియమించారు. గన్నవరం  అసెంబ్లీ నియోజకవర్గానికి  త్వరలోనే ఇంచార్జీని నియమించే అవకాశం ఉంది.  ఎన్ఆర్ఐని  ఈ స్థానంలో బరిలోకి దింపే అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది.
 

79
TDP Chandrababu

నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీగా  మల్లెల రాజశేఖర్ గౌడ్ కు  బాధ్యతలు కేటాయించారు.  కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలను  బీటీ నాయుడికి  చంద్రబాబు కేటాయించారు. కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జీగా ఉన్న  సోమిశెట్టి వెంకటేశ్వర్లును  టీడీపీ ప్రధాన కార్యదర్శిగా  చంద్రబాబునాయుడు నియమించారు.

89
chandrababu

వచ్చే ఎన్నికల్లో  జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది.  ఈ మేరకు  ఈ రెండు పార్టీలు సంకేతాలు  ఇచ్చాయి.  అయితే  ఈ కూటమిలో  ఇతర విపక్షాలు  కలిసి వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేమనే  రాజకీయ విశ్లేషకులు  చెబుతున్నారు.

99
Chandrababu Naidu

ఇదిలా ఉంటే  రాష్ట్రంలోని  పలు  జిల్లాలోని  80 అసెంబ్లీ స్థానాల్లో  అభ్యర్ధులను  చంద్రబాబు  ఖరారు  చేశారు.  అయితే  ఇతర పార్టీలతో  పొత్తులతో ఇబ్బంది లేని  స్థానాలకు  చెందిన అభ్యర్ధులను బాబు ఖరారు చేశారని  తెలుస్తుంది.  ఇతర అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధుల ఖరారు విషయమై  కూడ చంద్రబాబు  ఫోకస్ పెట్టారు. 


 

click me!

Recommended Stories