ఆంధ్రప్రదేశ్ వాతావరణం పూర్తిగా మారింది. అల్పపీడన ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా కూల్ అయింది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఏలూరు, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ నెల 14న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.