ఎండ తీవ్రత కారణంగా డీహైడ్రేషన్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. ఎండలో పనిచేసే వారు కచ్చితంగా టోపీలు, మెడలో కండువ వంటివి ధరించాలి. డీహైడ్రేషన్కు గురి కాకుండా మంచి నీటితో పాటు, మజ్జిగ వంటివి తీసుకోవాలని చెబుతున్నారు.