Viral News
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారికి అలేఖ్య చిట్టి పికెల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు కచ్చితంగా వీరి రీల్స్ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు మొదట అలేఖ్య చిట్టి పికెల్స్ పచ్చళ్ల బిజినెస్ను ప్రారంభించారు. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు. వీరి వీడియోల్లాగే వీరి వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది.
సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఈ అక్కా చెల్లెళ్లు తమ బిజినెస్ను ఎంతో ధైర్యంగా కొనసాగిస్తున్నారు. నాన్ వెజ్ పికిల్స్ తయారీ విధానాన్ని వివరిస్తూ వీడియోలను పోస్ట్ చేస్తారు. అదే విధంగా ఆన్లైన్లో ఆర్డర్లను స్వీకరించి నేరుగా పికిల్స్ను కొరియర్ చేస్తూ వ్యాపారాన్ని నడిపిస్తున్నారీ సిస్టర్స్. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెగిటివిటీ మూటగట్టుకుంటున్నారు.
alekhya pickles issue
ఇంతకీ ఏం జరిగిందంటే.?
అలేఖ్య చిట్టి పికెల్స్ ధరలను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ మెసేజ్ చేశాడు. కిలో చికెన్ పికిల్ ధర రూ. 1200 ఉందని, చేతులు జోడించిన ఎమోజీ పెట్టి, మరీ ఇంత ఎక్కువ ధరా.? అంటూ ఓ మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్కు అలేఖ్య పికెల్స్ నుంచి కస్టమర్ను కించపరిచేలా ఉన్నట్లు ఉన్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. పికిల్స్ కొనే స్థోమత లేని నువ్వు భవిష్యత్తులో పెళ్లి చేసుకోకు అంటూ వాయిస్ మెసేజ్లో ఉంది. అయితే అక్కడితో ఆగకుండా రాయడానికి కూడా వీలుకాని భాషలో దూషిస్తున్నట్లు ఆడియోలో ఉంది.
ఫైర్ అవుతోన్న నెటిజన్లు
వైరల్ అవుతోన్న ఈ వాయిస్ మెసేజ్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కస్టమర్ వినయంగా ప్రశ్నిస్తే, అంత దారుణంగా మాట్లాడడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు ట్రోలింగ్ ఎక్కువయ్యే సరికి అలేఖ్య చిట్టి పికెల్స్ ఫోన్ నెంబర్ ను తాత్కాలింకంగా నిలిపివేశారు. అటు వాట్సాప్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు. ఇన్ స్టాలో కూడా ఓపెన్ అవ్వడం లేదు. ప్రస్తుతం వెబ్ సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. మంచి అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇలా ఓవర్ యాక్షన్ చేయడం ఏంటంటూ నిందిస్తున్నారు.