Tirumala : మార్చిలో ఓ రోజంతా మూతపడనున్న తిరుమల ఆలయం... ఎందుకో తెలుసా?

Published : Feb 17, 2026, 07:20 PM IST

వచ్చే నెల మార్చి 3న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి ఆరోజు తిరుమలకు వెళ్లకపోవడమే మంచిది. అసలు ఎందుకు ఆలయాన్ని మూసేస్తున్నారో తెలుసా?

PREV
15
మార్చిలో మూతపడనున్న శ్రీవారి ఆలయం..

Lunar Eclipse : కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది తిరుమల వెళుతుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాదు దేశ విదేశాల నుండి కూడా శ్రీవారి భక్తులు తరలి వెళుతుంటారు. ఇలా వచ్చే నెల మార్చిలో తిరుమలకు వెళ్లాలని భావిస్తున్న భక్తులకు ముఖ్య సూచన. మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేసి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ట్రస్ట్ ప్రకటించింది... కాబట్టి ఆరోజు భక్తులు తిరుమలకు వెళ్లకపోవడమే మంచిది.

25
ఎందుకు శ్రీవారి ఆలయం మూతపడనుంది..?

మార్చి 3న పౌర్ణమి ఉంది... ఈ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం గ్రహణాల సమయంలో దేవాలయాలను మూసివేస్తారు... అందుకే తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. గ్రహణం అనంతరం ఆలయాన్ని తెరిచి సంపోక్షణ చేపడతారు అర్చకులు... ఆ తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు.

35
మార్చి 3న శ్రీవారి ఆలయం తెరిచివుండే వేళలు..

మార్చి 3న అంటే గ్రహణం రోజు తెల్లవారుజామున యదావిధిగా 5 గంటలకే ఆలయాన్ని తెరుస్తారు. 9 లేదా 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు.. ఆ తర్వాత ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి రాత్రికి ఆలయాన్ని తెరుస్తారు.

చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 వరకు కొనసాగుతోంది. అయితే గ్రహణానికి చాలా ముందుగానే తిరుమల ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇక గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్దిచేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు... అందుకోసం కొంత సమయం పడుతుంది. రాత్రి 7.30 లేదా 8.30 గంటల నుండి తిరిగి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇలా మార్చి 3న ఉదయం 9-10 గంటల మధ్య తిరుమల ఆలయం మూతపడి తిరిగా 7.30-8.30 గంటల సమయంలో తెరుచుకుంటుంది.

45
మార్చి 3న అన్నిరకాల సేవలు బంద్...

చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారికి నిత్యం చేపట్టే కొన్ని పూజలు నిలిచిపోనున్నాయి. అన్నిరకాల ఆర్జిత సేవలు, వీఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి... ఈ మేరకు ముందస్తుగా టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు ఇప్పటికే సమాచారం అందించారు. ఈరోజు తిరుమల రావాలనుకునే భక్తులు తమ ప్రయాణ ఏర్పాట్లను మార్చుకోవాలని టీటీడీ సూచించింది.

55
మార్చి 3న తిరుమలలో ప్రత్యేక ఉత్సవం...

ఇక ఇదే మార్చి 3న అంటే చంద్రగ్రహణం రోజున తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవం జరగనుంది. ఫల్గుణ పౌర్ణమి నాడు జరిగే ఈ ఉత్సవంలో తీర్థ స్నానం చేస్తే ఆరోగ్యం, దీర్ఘాయువు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. కాబట్టి భక్తులు ఎక్కువగా తరలివచ్చే అవకాశాలుంటాయి... అందుకే ముందుగా ఆలయ టైమింగ్స్ తెలుసుకుని దాని ప్రకారం దర్శనానికి రావాలని టిటిడి సూచిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories