రుషికొండ ప్యాలస్ లో మసాజ్ టేబుల్ ...  ప్రధాని కోసమేనా జగన్..!! : టిడిపి సంచలనం

First Published Jun 18, 2024, 10:01 PM IST

రుషికొండపై వైసిపి సర్కార్ నిర్మించినవి భవనాలు కాదు ఓ రాజమహల్... ఆ భవనాలను చూసిన ఎవ్వరయినా ఇదే అంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ భవనాల గురించే హాట్ టాాఫిక్ సాగుతోంది.

Rushikonda

విశాఖపట్నం : రుషికొండపై గత వైసిపి ప్రభుత్వం నిర్మించిన భవనాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జగన్ సర్కార్ అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ భవనాల తలుపులు ఇటీవల తెరుచుకున్నాయి. కూటమి ప్రభుత్వ ఏర్పాటుతర్వాత రుషికొండపై ఆంక్షలు తొలగిపోయాయి... దీంతో రాజప్రాసాదాన్ని పోలిన భవనాల పోటోలు, వీడియోలు భయటకు వచ్చాయి. వాటిని చూసి సామాన్య ప్రజలు నోరేళ్లబెడుతున్నారు. 

Rushikonda

రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విలాసాల కోసమే రుషికొండపై ఇంతటి లగ్జరీ భవనాలను నిర్మించుకున్నారని టిడిపి, జనసేన, బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజాధనంతో ఏకంగా రాజభవనాన్నే నిర్మించుకున్నారని మండిపడుతున్నారు. అసలు మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయమే సరికాదు... అలాంటిది ఆ పేరిట వందలకోట్లతో రాజభవనాలు కట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్, తాడేపల్లి, బెంగళూరులో ప్యాలస్ లు చాలవన్నట్లు విశాఖలోనూ ఓ ప్యాలస్ నిర్మించుకున్నారంటూ జగన్ పై మండిపడుతున్నారు. 

Latest Videos


Rushikonda

అయితే రుషికొండ భవనాల ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చి వివాదం చెలరేగడంపై వైసిపి రియాక్ట్ అయ్యింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ... రుషికొండ భవనాలు వైఎస్ జగన్ తనకోసం కట్టుకున్నవి కావన్నారు. ముందునుండి ఈ భవనాలను టూరిజం కోసమే నిర్మిస్తున్నామని చెబుతూ వచ్చామని... ఏనాడూ సీఎం క్యాంప్ కార్యాలయం కోసమని తాము చెప్పలేదన్నారు. విశాఖకు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ వంటి ప్రముఖులు వచ్చినపుడు బస చేసేలా అన్ని సౌకర్యాలతో అందంగా రుషికొండపై భవనాలను నిర్మించినట్లు మాజీ మంత్రి అమర్నాథ్ తెలిపారు.  

Rushikonda

అయితే అమర్నాథ్ వ్యాఖ్యలకు టిడిపి కౌంటర్ ఇచ్చింది. రుషికొండ భవనాల్లో బాగా వివాదాస్పదం అవుతున్నది విలాసవంతమైన బాత్రూం మరియు మసాజ్ టేబుల్. వీటిని ప్రస్తావిస్తూనే టిడిపి ఓ ట్వీట్ చేసింది. 
 

Rushikonda

''ఏమి మాట్లాడిస్తున్నావ్ జగన్? రాష్ట్రపతి కోసం, ప్రధాని కోసం, ఇతర పెద్దల కోసం అంటున్నావ్... మరి బాత్ రూమ్‌లో "స్పా" ఎందుకు పెట్టావ్? వాళ్ళు ఇక్కడకు వచ్చి మసాజులు చేసుకుంటారా? నీ బరితెగింపుని గౌరవంగా ఉండే ఆ పెద్దల మీద రుద్దుతావు ఎందుకు?'' అంటూ రుషికొండ భవనాలపై అమర్నాథ్ చేసిన కామెంట్స్ కు టిడిపి కౌంటర్ ఇచ్చింది. 

Rushikonda

ఇదిలావుంటే రుషికొండపై లక్షా 41వేలకు పైగా చదరపు అడుగుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మించారు. కళింగ, గజపతి, వెంగి పేరిట మూడు బ్లాకులు వున్నాయి. విశాలమైన కారిడార్లు, విలాసవంతమైన గదులు, కళ్లుచెదిరే ఫర్నీచర్ తో ఈ భవనాలు అత్యంత ఖరీదైనవిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ భవనాల్లోని బాత్రూంలు పేద, మధ్య తరగతి కుటుంబాల నివాసాల కంటే ఎక్కువ ఖర్చుతో నిర్మించారని... ఒక్కోటి దాదాపు 500 చదరపు అడుగుల వైశాల్యంలో వున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగారు రంగు షవర్లు, కుళాయిలు, లక్షల విలువైన బాత్ టబ్ తో కూడిన బాత్రూం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

Rushikonda

ఇక ఈ భవనాల్లో అడుగుపెడితే మాసిపోతాయేమో అనేలా ఖరీదైన ఇటాలియన్ మార్బుల్స్ ఏర్పాటుచేసారు. ఇక పైకి చూస్తూ కళ్లు చెదిరేలా ఖరీదైన లైటింగ్ ఏర్పాటుచేసారు. కేవలం వరండాల్లో అమర్చిన షాండ్లియర్‌ ఖరీదే రూ.2 లక్షలట. అలాంటివి పదుల సంఖ్యలో ఈ భవనాల్లో ఉన్నాయి.
ఇంటీరియర్‌ డెకరేషన్‌ కోసం వినియోగించిన వస్తువులు, ఫర్నిచర్‌ ఖరీదు రూ.33 కోట్లట. రోడ్లు, డ్రైన్లు, పార్కుల అభివృద్ధికి రూ.50 కోట్లు ఖర్చు చేసారట. 
 
 

Rushikonda

మొత్తంగా రుషికొండపై భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూ.452 కోట్లు. ఇప్పటివరకు ఖర్చు చేసింది రూ.407 కోట్లు. మళ్లీ వైసిపి అధికారంలోకి వచ్చివుంటే మరో వంద రెండోందల కోట్లు తమ విలాసాల కోసం వైఎస్ జగన్ తగలేసేవారని టిడిపి నాయకులు మండిపడుతున్నారు. అయితే ఇంత విలాసవంతంగా నిర్మించిన భవనాలను ఇప్పుడు కూటమి సర్కార్ ఏం చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. 
 
 
 

click me!