ఇంటర్ లో బాలికలదే పైచేయి..
ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ ఏడాది కూడా విద్యార్థినులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే పైచేయి సాధించి, విద్యారంగంలో తమ జోరును కొనసాగించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం గణనీయంగా ఉండటం విశేషం.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అమ్మాయిలు 81 శాతం, అబ్బాయిలు 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్ లో కూడా అమ్మాయిలు 85 శాతం, అబ్బాయిలు 76 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఇంటర్ ఫలితాలను చూస్తే అమ్మాయిలతే పైచేయిగా నిలిచింది.
ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 77శాతం, సెకండ్ ఇయర్ లో 81 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షరాసిన 4,46,537 మంది విద్యార్థుల్లో 3,59,816 మంది పాస్ అయ్యారు... అంటే దాదాపు లక్షమంది ఫెయిల్ అయ్యారు. సెకండ్ ఇయర్ లో 4,71,864 మంది ఎగ్జామ్ రాయగా 3,61,526 మంది పాసయ్యారు. అంటే ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ లో ఫెయిల్యూర్ శాతం ఎక్కువగా ఉంది.