1. చెట్లు ఎక్కువగా పిడుగులను ఆకర్షిస్తాయి. కాబట్టి వర్ష సమయంలో చెట్లకింద ఉండరాదు.
2. వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు ఎక్కువగా చెట్లమధ్యన ఉంటారు. కాబట్టి వారికి పిడుగులు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్ష సమయంలో చెట్లకింద కాకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
3. ఆరుబయట పనులు చేసుకునేవారికి కూడా పిడుగులబారిన ఎక్కువగా పడుతుంటారు. వీళ్లు వర్ష సమయంలో జాగ్రత్తలు పాటించాలి.
4. వర్ష సమయంలో ఇళ్లు, ఆఫీసుల్లో ఉన్నవారు అక్కడే ఉండాలి... అత్యవసరం అయితేనే వర్షంలో బయటకు రావాలి.
5. విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, కరెంట్ స్తంభాలు, వైర్లు వంటివాటిపై కూడా పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వర్ష సమయంలో వీటికి దూరంగా ఉండాలి.
6. పశువులు, ఇతర మూగజీవులను కూడా వర్షం కురిసే సమయంలో చెట్లకింద ఉంచరాదు.
7. తాత్కాలిక నివాసాల్లో అంటే పూరిగుడిసెలు, రేకుల షెడ్డుల్లో నివాసముండేవారు కూడా వర్ష సమయంలో జాగ్రత్త. వీటిపై పిడుగులు పడితే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది.
8. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు ఉపయోగించరాదు. పిడుగుపాటు సమయంలో వీటిలో విద్యుత్ ప్రవాహం ఎక్కువై ప్రమాదాలు జరగవచ్చు.