Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడ‌నం.. ఈ ప్రాంతాల్లో వ‌ర్షాలే వ‌ర్షాలు

Published : Jan 08, 2026, 06:22 PM IST

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మ‌రోసారి వాతావ‌ర‌ణంలో ఒక్క‌సారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం క్ర‌మంగా వాయుగుండంగా మారింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. 

PREV
15
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారింది. ఈ వ్యవస్థ పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ వర్షాల రూపంలో, తెలంగాణలో చలి తీవ్రత రూపంలో కనిపించనుంది.

25
శ్రీలంకలో తీరం దాటే అవకాశం

అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం ఈ వాయుగుండం జనవరి 9 సాయంత్రం లేదా రాత్రి సమయంలో శ్రీలంకలోని హంబన్‌టోట–కల్మునై మధ్య తీరం దాటే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది చెన్నైకి ఆగ్నేయంగా సుమారు 980 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కొనసాగే అవకాశం ఉంది.

35
ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన

వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారనుంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో శుక్రవారం, శనివారం వరకు వాతావరణం ప్రధానంగా పొడిగానే ఉంటుంది. తెల్లవారుజామున కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కనిపించే అవకాశం ఉంది.

ఇక దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో శనివారం జనవరి 10న ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

45
తెలంగాణలో చ‌లి ప్ర‌భావం

వాయుగుండం ప్రభావం ప్రత్యక్షంగా వర్షాల రూపంలో కాకపోయినా, తెలంగాణలో చలి తీవ్రత పెరగనుంది. ఉత్తర గాలుల ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పల్లెల్లో పొగమంచు ఎక్కువగా ఏర్పడే సూచనలు ఉన్నాయి. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

55
ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు

వర్షాలు కురిసే ప్రాంతాల్లో రైతులు పొలాల పనుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చలి తీవ్రత పెరిగే అవ‌కాశం ఉన్న‌ నేపథ్యంలో ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories