Rain Alert: ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే.. వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Published : Jun 18, 2026, 08:12 PM IST

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదించింది. తూర్పు విదర్భ నుండి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. 

PREV
12
రాబోయే నాలుగు రోజుల్లో వర్ష సూచన

తూర్పు విదర్భ నుండి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఈ ద్రోణి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మీదుగా విస్తరించి ఉంది. 

దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

22
అధికారుల హెచ్చరికలు

విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు తాజా వాతావరణ పరిస్థితులపై స్పందించారు. ప్రజలు వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాలలో ఉండాలని, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని సూచించారు. అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలియజేశారు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వచ్చినా ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories