తూర్పు విదర్భ నుండి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఈ ద్రోణి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మీదుగా విస్తరించి ఉంది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు.