రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉంది.
ఈ రోజు (శుక్రవారం): నెల్లూరు, తిరుపతి పరిసరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
శనివారం: తిరుపతి, అనన్తపురం, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం: వైఎస్సార్ కడప, పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడవచ్చు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వాన కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సోమవారం: గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు ప్రమాద సూచికలు ప్రకటించారు. నంద్యాల, కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం కొనసాగే అవకాశం ఉంది.
వర్షాలతో పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.