Amaravati Maha Padayatra: ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత... రైతులపై పోలీసుల లాఠీచార్జ్ (ఫోటోలు)
First Published Nov 11, 2021, 2:38 PM ISTఅమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని... మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు న్యాయస్థానం టు దేవస్థానం పేరిట చేపట్టిన మహా పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రగా వస్తున్న రాజధాని రైతులకు స్వాగతం పలికేందుకు స్థానికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసారు.