క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం... అమరజీవికి సీఎం జగన్ నివాళి (ఫోటోలు)
First Published Nov 1, 2021, 3:08 PM ISTఅమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సాయుధదళాల గౌరవవందనం స్వీకరించారు.