జిల్లాల వారీగా వానల అంచనా.. మంగళవారం వీళ్ళకే అలర్ట్
సోమవారం (జూన్ 29) కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఇక అసలు సిసలైన అలర్ట్ మంగళవారం (జూన్ 30) నాడు ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఈ
జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ లైట్ వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఆదివారం సాయంత్రానికే మంగళగిరిలో 68.2 మిమీ, రాజంలో 52.5 మిమీ, కాకుమానులో 51.5 మిమీ, తాడేపల్లిలో 45.2 మిమీ చొప్పున భారీ వర్షపాతం రికార్డైంది.