అమరావతి ఓ నగరం కాదు.. ఐదు నగరాల సమ్మేళనం
ఏపీ నూతన రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఒక వినూత్న 'పీపుల్స్ క్యాపిటల్'. కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా థీమ్ నగరాలుగా విభజించారు. అవి..
నాలెడ్జ్ సిటీ : విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాల కోసం.
జస్టిస్ సిటీ : హైకోర్టు, న్యాయ సంబంధిత సంస్థల కోసం.
ఫైనాన్షియల్ సిటీ : బ్యాంకింగ్, వాణిజ్య కేంద్రంగా.
హెల్త్ సిటీ : అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రుల కోసం.
గవర్నమెంట్ సిటీ : సచివాలయం, అసెంబ్లీ, రాజ్భవన్ కోసం.