పోటీకి దూరంగా:
జనసేన పార్టీ లక్ష్యం ప్రశ్నించడం మాత్రమే, అధికారం అంతిమ లక్ష్యం కాదని పలుసార్లు చెప్పిన పవన్ ఆ దిశగానే అడుగులు వేశారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత చాలా దాదాపు పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్ధతు ప్రకటించారు. పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, రాజకీయంగా విశేష ప్రాధాన్యత పొందింది. 2019లో తొలిసారి ప్రత్యక్ష పోటీలో నిలిచారు. 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో పోటీ చేసింది. పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండు స్థానాల నుంచి పోటీ చేశారు, అయితే రెండింటిలోనూ ఓడిపోయారు. పార్టీ తరపున రాపాక వరప్రసాద్ ఒకే ఒక స్థానంలో విజయం సాధించారు (రాజోలు నియోజకవర్గం).