ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది.? వాతావరణ శాఖ వేస్తున్న అంచనాలు ఏంటంటే.
తమిళనాడు తీరానికి దగ్గరగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి సగటుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. సోమవారం హిందూ మహాసముద్రం నుంచి నైరుతి బంగాళాఖాతం దాకా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం బలహీనపడింది. దిగువ వాయు మండలంలో గాలుల దిశలో మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం ప్రాంతాల్లో గాలులు నైరుతి దిశగా వీస్తుండగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో తూర్పు, ఆగ్నేయ దిశలవైపు గాలుల ప్రభావం కనిపిస్తోంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో మూడు రోజులు వాతావరణ సూచన ఎలా ఉండనుందంటే.