ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రెండ్రోజులు(గురు, శుక్ర) వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. చాలాప్రాంతాల్లో మోస్తరు వర్షాలే కురుస్తాయని... అక్కడక్కడ మాత్రం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
ఇక రేపు (శుక్రవారం) కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు. నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.