Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క ట్వీట్ ప్రస్తుతం రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీసింది. మరి ఆ పోస్ట్ ఏంటి.? ఆ వివరాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాం..
యువతను రాజకీయాల్లోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా చురుగ్గా వ్యవహరిస్తారు. పరిపాలనలో పెద్ద మార్పు రావాలంటే సమకాలీన రాజకీయాల్లో యువత చురుకుగా పాల్గొనాలని ఆయన పదే పదే పిలుపునిస్తూ వచ్చారు.
25
యువతకు పిలుపు..
ఈ సందర్భంలో, పవన్ కళ్యాణ్ యువత రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనాలని, యువరక్తం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుందని ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
35
సేనతో సేనాని వైరల్ పోస్ట్..
పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఆయన తన జనసేన పార్టీ నేతృత్వంలో 'సేనతో సేనాని' అనే కార్యక్రమాన్ని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, సామాజిక మార్పును తీసుకురావడానికి ఎంచుకున్న ప్రాంతాలలో స్వచ్ఛంద సేవ కోసం ఉత్సాహభరితమైన యువత నమోదు చేసుకోవాలని ఆహ్వానించారు.
55
మార్పు వచ్చేది ఇలా..
మాటలతో కాదు.. చురుకైన రాజకీయ భాగస్వామ్యం ద్వారా మాత్రమే సమాజంలో మార్పు తీసుకురాగలమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మెరుగైన పరిపాలన, కొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు చురుకుగా పోరాడుతున్న జనసేన పార్టీ వ్యవస్థలో భాగం కావడానికి యువతకు ఇదొక సువర్ణావకాశం అన్నారు పవన్.