చంద్రబాబు తన పర్యటనలో 25కి పైగా సమావేశాల్లో పాల్గొని, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేక పెట్టుబడి ప్రణాళికను వివరించారు. చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తరాంధ్ర: ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా అభివృద్ధి.
విశాఖపట్నం: గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.
రాయలసీమ: పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, సెమీ కండక్టర్ పరిశ్రమలకు ప్రాధాన్యం.
గోదావరి జిల్లాలు: ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, టూరిజం రంగాలపై దృష్టి.
అమరావతి: దేశంలో తొలి "క్వాంటం వ్యాలీ" స్థాపనకు ఏర్పాట్లు.
ప్రతీ ప్రాంతంలో "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానాన్ని అమలు చేస్తామని, పెట్టుబడిదారులు ఎదుర్కొనే అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.