ఈ విషయాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం తన అధికారిక ఫేస్బుక్ పేజీలో బుధవారం వెల్లడించింది. ‘‘ఈరోజు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తల్లిదండ్రులు యశ్వీర్ సునాక్, ఉషా సునాక్ మంత్రాలయాన్ని సందర్శించారు. వారి వెంట ఇన్ఫోసిస్ సుధా నారాయణ మూర్తి ఉన్నారు. వారంతా కలిసి శ్రీ రాయారు దర్శనం చేసుకున్నారు. వారి సందర్శన సమయంలో శ్రీ స్వామీజీ వారికి వస్త్రం, ఫల మంత్రాక్షతే, జ్ఞాపికతో తన ఆశీర్వాదాన్ని అందించారు.’’ అని పోస్టులో పేర్కొంది.