అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే..
ఫిబ్రవరిలో పగటి ఉష్ణోగ్రతలు దేశంలోనే అత్యధికంగా ఎక్కువ రోజులు ఆంధప్రదేశ్లోని రాయలసీమ, కోస్తా, కేరళ, కర్ణాటకల్లో నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో ముందుగానే వేసవి ప్రారంభమైంది. అయితే ప్రతీ ఏటా ఇలాగే జరిగినా ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. కొన్ని చోట్ల గాలిలో తేమ భారీగా తగ్గుతోంది. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. మరి రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం ఎలాగా ఉంటుందో చూడాలి.