Arunachalam: అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక డైరెక్ట్ ట్రైన్‌లో గిరిప్రదక్షిణకు !

Published : May 14, 2026, 09:13 AM IST

Arunachalam : తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించింది. అలాగే, హైదరాబాద్, వైజాగ్ నుంచి అందుబాటులో ఉన్న రైళ్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
వైజాగ్, హైదరాబాద్ భక్తులకు గుడ్ న్యూస్.. అరుణాచలం వరకు స్పెషల్ ట్రైన్స్ ఇవే

అరుణాచల శివుడి దర్శనం కోసం ఏపీ, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు ప్రతి నెలా తమిళనాడుకు వెళ్తుంటారు. అయితే సరైన రైలు సౌకర్యం లేక చాలా మంది ఇబ్బంది పడేవారు. భక్తుల కష్టాలను గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. గుంటూరు నుంచి తిరుపతికి నడిచే ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పుడు ఏకంగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగించారు. అంటే ఇకపై మన ఊరి నుంచే నేరుగా అరుణాచలం వెళ్ళిపోవచ్చు.

25
గుంటూరు టు తిరుచ్చి.. అరుణాచలం మీదుగానే

ప్రస్తుతం గుంటూరు-తిరుపతి మధ్య నడుస్తున్న 17261/17262 ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను తిరుచిరాపల్లి వరకు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ రైలు తిరుపతి దాటిన తర్వాత చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు మీదుగా తిరువన్నామలై (అరుణాచలం) చేరుకుంటుంది. అక్కడి నుంచి శ్రీరంగం మీదుగా తిరుచ్చి వెళ్తుంది. దీనివల్ల పల్నాడు, ప్రకాశం, రాయలసీమ భక్తులకు అరుణాచలేశ్వరుడి దర్శనం చాలా ఈజీ అయిపోనుంది.

35
వెల్లూరు గోల్డెన్ టెంపుల్, శ్రీరంగం వెళ్ళే వారికి గుడ్ న్యూస్

ఈ రైలు పొడిగింపు కేవలం అరుణాచలం భక్తులకే కాదు, వెల్లూరులోని శ్రీపురం గోల్డెన్ టెంపుల్, శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రైలు మార్కాపురం, నంద్యాల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లా మీదుగా వెళ్తుంది కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి.

45
హైదరాబాద్ భక్తుల కోసం డైరెక్ట్ ట్రైన్స్ ఇవే..

భాగ్యనగర భక్తుల కోసం కూడా రైల్వే శాఖ పలు రైళ్లను నడుపుతోంది..

• కాచిగూడ - ట్యుటికోరిన్ ఎక్స్‌ప్రెస్ (17615): ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:28కి తిరువన్నామలై చేరుకుంటుంది.

• చర్లపల్లి - తిరుచ్చి స్పెషల్ (07615): ప్రతి మంగళవారం సాయంత్రం 5:50కి బయలుదేరి మధ్యాహ్నం 1:20కి మిమ్మల్ని అరుణాచలం చేరుస్తుంది.

• నాంపల్లి - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ (17069): ప్రతి బుధవారం సాయంత్రం 4:45కి స్టార్ట్ అయ్యి మరుసటి రోజు మధ్యాహ్నం 12:43కి అరుణాచలం వెళ్తుంది.

55
వైజాగ్ ప్రజల కోసం సూపర్ ఫాస్ట్ సర్వీసులు

విశాఖపట్నం నుంచి కూడా అరుణాచలం వరకు కూడా రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

• ఖరగ్‌పూర్ - విల్లుపురం (22603): ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 1:40కి వైజాగ్‌లో ఎక్కితే అదే రోజు సాయంత్రం 5:26కి తిరువన్నామలై దిగొచ్చు.

• హౌరా - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (12867): ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:15కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:29కి మిమ్మల్ని శివుడి సన్నిధికి చేరుస్తుంది.

ఇవే కాకుండా తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్లు వరకు పొడిగించడం, కొత్తగా ప్యాసింజర్ రైళ్లు ప్రారంభించడం వంటి నిర్ణయాలతో రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Read more Photos on
click me!

Recommended Stories