రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ చేయించుకోవాలనుకునే వారు ఈ నెల 13 నుంచి 22వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వరు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ తర్వాత మార్కులు తగ్గినా, పెరిగినా వాటిని తుది ఫలితంగా నిర్ణయిస్తారు. రీ వాల్యుయేషన్ కోరితే విద్యార్థులకు జవాబు పత్రాల స్కానింగ్ కాపీ పంపుతారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.