డీఎస్సీకి సంబంధించి రోజుకో అప్డేట్ను ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇటీవల డీఎస్సీ దరఖాస్తుల విధానంలో కూడా పలు మార్పులు చేశారు. ఏ, బీలుగా దరఖాస్తులను వేరుచేసి వివరాలు సేకరించనున్నారు. అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమశాఖల యాజమాన్యాల ఎంపికకు దరఖాస్తు సమయంలోనే ఆప్షన్స్ ఇవ్వాలని అధికారులు తెలిపారు. ఇక దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్-బీలో సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పించనున్నారు.