వేల కార్లను ఉత్పత్తి చేసే సంస్థలో ఇటీవల ఆడిట్ జరగగా.. ఇంజిన్లు పోయిన సంగతి వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నెలరోజులుగా సీసీ కెమెరాలు, తదితర వివరాలను క్షున్నంగా పరిశీలించి 9 మందిని అరెస్టు చేయగా.. వారిని విచారించిన తర్వాత మరింత మంది అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని వెనుక కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.