Kia Engine Theft AP: కియా ఇంజిన్లు కొట్టేసిన దొంగలు దొరికారు.. ఇంటి దొంగల పనేనా?
Kia Engine Theft AP: కియా కార్ల ఇంజిన్లు చోరీకి పాల్పడిన దొంగలు ఎట్టకేలకు దొరికారు. దాదాపు నెలరోజుల తర్వాత పోలీసులు దొంగలను పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం యర్రమంచి గ్రామంలో ఉన్న కియా పరిశ్రమలో మార్చి 19న కార్ల ఇంజిన్లు 900 వరకు మాయమయ్యాయని పంచాయతీ యాజమాన్యం ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బయటకు రాగానే పోలీసులతోపాటు అందరూ షాక్కి గురయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 900 వందల ఇంజిన్లు మాయం అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసుల విచారణ సాగిందిలా...