తెలంగాణలో వర్షాలు :
ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. గురు, శుక్రవారం రెండ్రోజులు భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో చిరుజల్లులు కురవనున్నాయని... కొన్నిచోట్లు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో వర్షాలు లేకున్నా ఆకాశం మేఘాలతో కమ్ముకుని ఉండి వాతావరణం చల్లబడుతుంది... కానీ కొన్నిప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. రెండ్రోజుల తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి మళ్లీ ఎండలు ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.