Andhra pradesh: త‌గిన శాస్తి జ‌రిగింది.. మ‌ద‌న‌పల్లె బాలిక హత్య కేసులో ఊహించ‌ని ట్విస్ట్. అసలేం జరిగిందంటే

Published : Feb 18, 2026, 12:44 PM IST

Andhra pradesh: అన్నమయ్య జిల్లాలో జరిగిన చిన్నారి హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహం లభించడం, ఆ కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి విషయంలో ఊహకందని ట్విస్ట్ అందరినీ షాక్‌కి గురి చేసింది. 

PREV
12
అదృశ్యం నుంచి హత్య వరకు

మదనపల్లె పట్టణంలో నివసిస్తున్న ఏడేళ్ల బాలిక మంగళవారం కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది గంటలకే ఇంటికి సమీపంలో ఉన్న ఒక డ్రమ్‌లో బాలిక మృతదేహం బయటపడింది. ఈ దృశ్యం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ప్రాథమిక దర్యాప్తులో బాలికపై లైంగిక దాడి జరిపిన తర్వాత హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు.

22
అనుమానితుడిపై పోలీసులు దృష్టి

బాలిక ఇంటి సమీపంలో నివసిస్తున్న కులవర్ధన్ అనే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతడు ఘటన అనంతరం కనిపించకుండా పోవడంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. దర్యాప్తులో బాలికను మాయమాటలతో ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డట్లు అధికారులు భావించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో సైతం లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైనట్లు సమాచారం.

చెరువులో నిందితుడి మృతదేహం

గాలింపు జరుగుతుండగానే కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో ఓ మృతదేహం కనిపించినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా అది కులవర్ధన్ మృతదేహమేనని గుర్తించారు. శరీరం ఉబ్బిపోయి ఉండటంతో దాదాపు పది గంటల ముందు మ‌ర‌ణించిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తూ చెరువులో పడ్డాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

కొన‌సాగుతోన్న విచార‌ణ

ఇదిలా ఉంటే నిందితుడి మృతికి సంబంధించిన ఖచ్చితమైన కారణం ఏమిటి అనే దానిపై ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. అటు బాలిక అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన జిల్లాలో భయాందోళనలకు దారితీసింది.

Read more Photos on
click me!

Recommended Stories