రేమాండ్తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్, సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు. అదనంగా న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతో చర్చలు జరపాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన అవకాశాలు పెరుగుతున్నాయని ఈ సదస్సు మొదటి రెండు రోజుల్లోనే స్పష్టమైంది.