ఇంతకీ ఆయన తన సర్వేలో ఏం చెప్పారంటే...
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసిపి మరోసారి విజయం సాధించే అవకాశాలున్నాయని ఆరా సర్వే తేల్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజాభిమానాన్ని పొందాడని... అందువల్లే వైసిపికి 94 నుండి 104 సీట్లు వచ్చే అవకాశం వుందని తేల్చింది. ఇక టిడిపి, జనసేన, బిజెపి కూటమి గట్టి ఫైట్ ఇచ్చినా కేవలం 71-81 స్థానాలకే పరిమితం కావచ్చని తెలిపింది. ఓట్ల పరంగా చూసుకుంటే వైసిపికి 49 శాతం, టిడిపి కూటమికి 47 శాతం ఓట్ షేర్ వస్తుందని ఆరా సర్వే తేల్చింది.