Latest Videos

నేరేడు పండ్లు కచ్చితంగా తినాల్సింది వీళ్లే..ఎందుకో తెలుసా?

By ramya SridharFirst Published Jul 4, 2024, 10:02 AM IST
Highlights

వీటిని షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే... షుగర్ పేషెంట్స్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 

వర్షాకాలంలో మనకు మార్కెట్లో నేరేడు పండ్లు విరివిగా లభిస్తూ ఉంటాయి. నేరేడు పండ్లను మనం ఇండియన్ బ్లాక్ బెర్రీ అని పిలుస్తూ ఉంటారు.  నేరేడు పండ్ల రుచి అందరికీ విపరీతంగా నచ్చేస్తుంది.  వీటిని షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే... షుగర్ పేషెంట్స్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీరికి మాత్రమే కాదు.. మరికొందరు కూడా కచ్చితంగా ఈ నేరేడు పండ్లను తమ డైట్ లో భాగం చేసుకోవాలట.  ఎవరు ఈ పండ్లను కచ్చితంగా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం...


నేరేడు పండ్లను గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా తినాలట.   ఎందుకంటే నేరేడు పండ్లలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది రక్త నాళాల గోడలలో ఉద్రిక్తతను తగ్గించడం ద్వారా రక్త ప్రసరణలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల గుండెకు నష్టం జరగకుండా కాపాడతాయి.
ఇది కాలేయానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కాలేయం మెరుగైన పనితీరుకు తోడ్పడతాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది, తద్వారా కాలేయం సక్రమంగా పనిచేస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్న రోగులకు కూడా ఇది మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కాలేయ మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

నేరేడు పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది. నిజానికి, నేరేడు పండ్లలో  విటమిన్ సి , ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి , ఐరన్ ని  గ్రహించడంలో సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనత నయమవుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది.

click me!