పార్టీ టైం అంటున్న ఎఫ్ 3 టీమ్.. అతిథిగా మారిన వెంకీ మామ!

By team teluguFirst Published Nov 9, 2021, 8:47 AM IST
Highlights

వెంకటేష్(Venkatesh) ఏర్పాటు చేసిన ఈ పార్టీకి దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు హీరో వరుణ్, తమన్నా(Tamannah) తో పాటు  మూవీలో కీలక రోల్స్ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు పాల్గొనడం జరిగింది.

విక్టరీ వెంకటేష్ తన ఎఫ్ 3(F3) టీమ్ కి ఆతిథ్యం ఇచ్చారు. తన నివాసంలో ఈ మూవీ దర్శక నిర్మాతలతో పాటు కో స్టార్స్ కి టీ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని హీరో వరుణ్ తేజ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. వెంకీ నివాసంలో పార్టీని ఎంజాయ్ చేస్తున్న ఫోటో షేర్ చేసిన వరుణ్ (Varun tej)... ''వెంకీ అన్నయ్య ఇంట్లో టీ పార్టీలో పాల్గొన్నాం. ఇలాంటి అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు'' అంటూ కామెంట్ చేశారు. 

వెంకటేష్ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు హీరో వరుణ్, తమన్నా తో పాటు మూవీలో కీలక రోల్స్ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, సునీల్ పాల్గొనడం జరిగింది. వీకెండ్ మూవీ యూనిట్ కోసం వెంకటేష్ ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.ఎఫ్ 3 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎఫ్ 3 2022 ఫిబ్రవరి 25న గ్రాండ్ గా విడుదల కానుంది.

2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 తెరక్కుతుంది. ఎఫ్ 2లో నటించిన సేమ్ స్టార్స్ వెంకీ, వరుణ్ తమన్నా, మెహ్రీన్ (Mehreen) సీక్వెల్ లో కూడా నటిస్తున్నారు. ఎఫ్ 2 భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది.

Also read`గని`గా మారిన అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌.. వరుణ్‌ తేజ్‌ సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్‌

మరోవైపు వరుణ్ గని (Ghani) మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వరుణ్ మొదటిసారి బాక్సర్ రోల్ చేస్తుండగా, దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. గని ప్రోమోలు మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఈ సినిమా కోసం వరుణ్ కండలు తిరిగిన దేహం సాధించాడు. సిద్దు ముద్దా, అల్లు బాబీ గని చిత్రానికి నిర్మాతలుగా ఉన్నారు. 

Also read విడాకులపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్, అంతలోనే డిలీట్... సమంత గురించేనా!

ఇక వెంకటేష్ నుండి క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 2 విడుదలకు సిద్ధంగా ఉంది. ఆయన హీరోగా నటించిన దృశ్యం చిత్రానికి ఇది సీక్వెల్ కావడం విశేషం.  వెంకీకి జంటగా మరోసారి మీన నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ కాగా, తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 
 

click me!