విజయ్‌ దేవరకొండ ఎవరో వాళ్ల గల్లీలో ఒక్కడికి కూడా తెలియదట.. ఏవీడీలో `పుష్పకవిమానం` ప్రీమియర్‌..

By Aithagoni RajuFirst Published Nov 9, 2021, 12:14 AM IST
Highlights

మహబూబ్‌ నగర్‌లో ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి విజయ్‌ దేవరకొండ `ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ` పేరుతో మల్టీప్లెక్స్‌ ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన సొంతం సినిమా వేసుకుంటున్నాడు విజయ్‌. 

`సినిమాల్లోకి రాకముందు మా గల్లీలో నేను ఎవరో ఒక్కరికి కూడా తెలియదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాను. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంటున్నాడు` రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda). తాను నిర్మించిన చిత్రం `పుష్పక విమానం`(Pushpaka Vimanam). Vijay Devarakonda తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ(Anand Devarakonda) హీరోగా నటిస్తున్నాడు.  గీత్‌ సైనీ, సాన్వీ మేఘాన కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. 

ఈ సందర్బంగా Pushpaka Vimanam ప్రీమియర్స్ ప్లాన్‌ చేశారు. మహబూబ్‌ నగర్‌లో ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి విజయ్‌ దేవరకొండ `ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ` పేరుతో మల్టీప్లెక్స్‌ ని నిర్మించిన విషయం తెలిసిందే. `లవ్‌ స్టోరీ`తో ఈ థియేటర్‌ ప్రారంభమైంది.ఇప్పుడు తన సొంతం సినిమా వేసుకుంటున్నాడు విజయ్‌. తమ్ముడు నటించగా, తాను నిర్మించిన `పుష్పక విమానం` సినిమాని ప్రదర్శించబోతున్నారు. ఒక్క రోజు ముందే, ఈ నెల 11 సాయంత్రం 7 గంటల షోతో ప్రీమియర్‌ వేయబోతున్నారు. ఈ విషయాన్ని విజయ్‌ ప్రకటించారు.

మరోవైపు ఇటీవల జరిగిన వైజాగ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ మాట్లాడాడు. ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. హీరోగా నేను ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు నిర్మాతలు దొరక్క చాలా కష్టాలు పడ్డాను. నా తరువాత వచ్చేవాళ్లు ఆ కష్టాలు పడకూడదనే ఒక బలమైన ఉద్దేశంతో నేను సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టాను. ఈ బాధ్యతను మోయడం చాలా కష్టంగా ఉంది .. అయినా అవకాశం పొందినవాళ్లు స్టేజ్‌పై మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. కష్టమైనా కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే అనుకుంటున్నాను. మా పేరెంట్స్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక ఇబ్బందిపడుతూనే నాకు పెట్రోల్ డబ్బులు ఇచ్చి ఆడిషన్స్‌కి పంపించారు.

సినిమాల్లోకి రాకముందు నేను ఎవరనేది మా గల్లీలో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి నేను ఇప్పుడు ఒక నటుడిగా.. నిర్మాతగా వైజాగ్‌లో స్టేజ్‌పై నిలబడి ఉన్నా. నేను ఈ స్థాయికి రావడానికి కారణం, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ .. మీ మీదున్న ఓవర్ కాన్ఫిడెన్స్‌` అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం విజయ్‌, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వలో `లైగర్‌ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమెరికన్‌ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు `దొరసాని`, `మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌` చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న ఆనంద్‌ దేవరకొండ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రంపై సర్వ్రతా ఆసక్తి నెలకొంది.

also read: Vijay Sethupathi: విజయ్‌ సేతుపతిని తంతే 1001 బహుమతి.. నెట్టింట దుమారం..

click me!