
జనతా గ్యారేజ్ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ బంపర్ సక్సెస్ కావటంతో... మళ్లీ తర్వాతి సినిమా కూడా ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని చిన్న గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ దర్శకుడు బాబీ చెప్పిన కథకు ఓకే చెప్పాడు. ఈ మూవీ ఫిబ్రవరి మూడో వారంలో మొదలవుతుంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు కావాలట. ఇప్పటికే ఇద్దర్ని అఫీషియల్ గా కన్ఫమ్ చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న లాంచనంగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. సినిమాకు జై లవకుశ అనే టైటిల్ కూడా రిజిష్టర్ చేయించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు. ఒకరు నివేదా థామస్ కాగా, మరొక హీరోయిన్ రాశిఖన్నా. జెంటిల్మన్ తర్వాత నివేదాథామస్ తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. నివేదా జూన్ నుండి షూటింగ్లో పాల్గొంటుందట.