తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్వంలో రిలే నిరాహార దీక్ష‌

Published : Jul 03, 2017, 04:22 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్వంలో రిలే నిరాహార దీక్ష‌

సారాంశం

జీఎస్టీ అమలు నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో నిరసన చిన్న నిర్మాతలకు పెను నష్టం వాటిల్లుతుందని ఆందోళన డిజిటల్  చార్జీలు, లీజ్ విధానం వల్ల నష్టం వస్తోందన్న టీ.ఎఫ్.సీ.సీ అధ్యక్షుడు ఆర్ .కె.గౌడ్

డిజిట‌ల్ రేట్లు, థియేట‌ర్ లీజు విధానం,  మినీ థియేట‌ర్ల నిర్మాణానికి ప్ర‌భుత్వం నుంచి 15 రోజులలోనే  అనుమ‌తి, చిన్న సినిమాల‌ను ప‌ర్సంటేజ్ ప‌ద్ధ‌తిలో ప్ర‌ద‌ర్శించాల‌ని,  కేంద్రం ప్ర‌భుత్వం  సినిమా ఇండ‌స్ర్టీ పై  తీసుకొచ్చిన 28 శాతం జీఎస్టీ పన్ను ర‌ద్దు.. తదితర అంశాల‌పై  తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్  రిలే నిరాహార దీక్ష‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

 

కాగా నేడు (సోమ‌వారం ఉద‌య) 10.30 గంట‌ల‌కు   ఆయ‌న బృందంతో హైద‌రాబాద్ తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఎదుట నిరాహార దీక్ష‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తాని మాట్లాడుతూ,  ` డిజ‌ట‌ల్ రేట్లు వారానికి 2500 చేయాలి. థియేట‌ర్ లీజు విధానం ర‌ద్దు చేయాలి. మినీ థియేట‌ర్స్ ను నిర్మించ‌డానికి ప్ర‌భుత్వం 15 రోజులలో అనుమ‌తి ఇవ్వాలి. చిన్న సినిమాల‌ను ప‌ర్సంటేజ్ ప‌ద్ద‌తిలో ప్ర‌ద‌ర్శించాలి. అలాగే జీఎస్టీ 28 శాతాన్ని 10 శాతానికి త‌గ్గించాల‌ని డింమాండ్`  చేశారు. ప్ర‌తాని దీక్ష‌కు సంఘీభావం తెలిపిన అనంత‌రం..

 

విప్ల‌వ చిత్రాల ద‌ర్శ‌కుడు ఆర్. నారాయ‌ణ మూర్తి మాట్లాడుతూ, ` సినిమా ఇండ‌స్ర్టీ బ్రోక‌ర్ల మ‌యం అయిపోయింది. ఇక్క‌డ వాళ్లే ద‌ర్జాగా బ్ర‌తుకు తున్నారు. వాళ్ల వ‌ల్ల చిన్న సినిమాలు కిల్ అవుతున్నాయి. థియేట‌ర్ల విష‌యంలో గుత్తాదిప‌త్యం కొన‌సాగుతుంది. దీనిపై తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు కూర్చుని త‌గిన విధంగా ఆలోచ‌న‌లు చేసి త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాలని` డిమాండ్ చేశారు.

 

తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ క‌విత మాట్లాడుతూ, ` జీఎస్టీ  వ‌ల్ల చిన్న సినిమా బ్ర‌తుకే శూన్యం అవు తుంద‌ని..28 శాతం గ‌నుక కొన‌సాగితే ఇక సినిమా జీవితం కోల్పోయిన‌ట్లే. అలాగే త‌మ డిమాండ్ల‌ను త‌క్ష‌ణం తీర్చాల‌ని`  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

 

కాగా రిలే నిరాహార దీక్ష‌లో తెలంగాణ  ఫిలింఛాంబ‌ర్  సెక్ర‌ట‌రీ సాయి వెంక‌ట్, క‌విత‌, ర‌మ్య శ్రీ, అన్న‌పూర్ణ‌, జాను, రోషం బాలు, బ‌ల్లెప‌ల్లి మోహ‌న్ , సంగీత ద‌ర్శ‌కుడు బో లే, బులెట్ ర‌వి, అక్ష‌ర, ఆర్ నారాయ‌ణ‌మూర్తి, న‌ట్టి కూమార్,శ్రీ లక్ష్మి ,పి.ఎన్,రామచంద్రావు,షెరాజ్,వాసిరాజు ప్రకాశం,జ్యోతి ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అలాగే కొంత మంది నిర్మాత‌లు.. 24 శాఖ‌ల‌కు చెందిన వారు  ప్ర‌తాని దీక్ష‌కు సంఘీభావం తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ