
అర్జున్ రెడ్డి సినిమాలో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది షాలిని పాండే. ఆ సినిమాలో ఆమె నటనకు ఇప్పటికే తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అర్జున్ రెడ్డి అలా విడుదలై.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో లేదో.. అప్పుడే షాలిని కి మరో బంపర్ ఆఫర్ తగిలింది.
అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘ మహానటి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సావత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో సమంత నటిస్తున్నారు. కాగా.. ఆ సినిమాలోని మరో కీలక పాత్ర కోసం షాలిని పాండేని తీసుకున్నట్లు సమాచారం.
నాగ్ అశ్విన్ ‘మహానటి’కి దర్శకత్వం వహిస్తున్నారు. సావిత్రి కథ తెలుసుకోవడానికి ఆయన చాలా పరిశోధనలు చేశారు. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, దుల్కర్ సల్మాన్లు కీలక పాత్రలు పోషిస్తుండగా.. విజయ్ దేవరకొండ, ప్రగ్యా జైశ్వాల్ ని కూడా ఈ సినిమా కోసం ఎంచుకున్నట్లు సమాచారం.