Ntr-Koratala movie : విసిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్.. యంగ్ టైగర్ ఏం చేయబోతున్నాడో తెలుసా..?

By Mahesh JujjuriFirst Published Jan 6, 2022, 2:25 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు విసుగోచ్చింది. ఓపిక నశించింది... ఇక నెక్ట్స్ ఏంటీ అని ఆలోచనలో పడ్డాడు తారక్. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఇక పరిగెత్తాలంటూ.. రేసుకి రెడీ అవుతున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) అసలు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంటాడు. ఒక సినిమా తరువాత మరో సినిమా వరుసగా అనౌన్స్ చేసుకుంటూ.. దూసుకుపోతుంటాడు. మధ్యలో ప్లాప్ లు పలకరించినా.. పట్టించుకోకుండా.. మంచి సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు. ఫ్యాన్స్ కు పక్కాగా అందుబాటులో ఉంటూ.. ఫ్యాన్స్ కు తనకు మధ్య గ్యాప్ రాకుండా చూసుకుంటూ ఉంటాడు. అటువంటిది.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ మూడేళ్లు సినిమా లేకుండా గడిపేశాడు.

 

2018 లో అరవింద సమేత రిలీజ్ అయిన తరువాత ఎన్టీఆర్(Ntr) సినిమా రాలేదు. ట్రిపుల్ ఆర్ (RRR) కోసం మూడేళ్లు త్యాగం చేశాడు తారక్.  అసలు ఈ సినిమాను ఏడాదిలో కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు టీమ్. కాని కాలం కలిసి రాక.. ట్రిపుల్ ఆర్ షూటింగ్ కు ఫస్ట్ నుంచీ ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంది. దాంతో డిలే అవుతూ.. అవుతూ.. రెండు రిలీజ్ డేట్స్ మార్చుకుని 2022 సంక్రాంతికి చేరింది సినిమా. మళ్లీ కరోనా ఫుణ్యమా అని రిలీజ్ డేట్ మరో సారి వాయిదా పడటంతో ఎన్టీఆర్(Ntr) లో ఓపిక నశించినట్టు తెలుస్తోంది.

 

ఇప్పటికే మూడేళ్ళు వేస్ట్ అయ్యాయి. యంగ్ టైగర్ ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారు. దాంతో ట్రిపుల్ ఆర్ సంగతి పక్కన పెట్టేసి... నెక్ట్స్ లైన్ లో ఉన్న తన సినిమాలు కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే కొరటాల శివ(Koratala Siva),  ఉప్పెన  ఫేమ్ బుచ్చిబాబు, కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు ఎన్టీఆర్(Ntr). అర్జెంట్ గా కొరటాల శివ సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.

 

ముందు లెక్కల ప్రకారం జనవరి 7న ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతుందనుకున్నారు. ఓనెల ట్రిపుల్ ఆర్ సక్సెస్ జోష్ ను ఎంజాయ్ చేసి.. మార్చ్ 4న కొరటాల శివ( Koratala Siva) డైరెక్ట్ చేసిన ఆచార్య రిలీజ్ అవుతుంది. అప్పుడు కొరటాల కూడా ఫ్రీ అవుతాడు... దాంతో పిబ్రవరి లాస్ట్ వీక్ కాని..మార్చ్ ఫస్ట్ వీక్ కాని కొరటాల శివ సినిమా స్టార్ట్ చేయాలి అనకున్నాడు ఎన్టీఆర్(Ntr)  . కాని ప్లాన్లు అన్నీ తలకిందులు కావడంతో.. ఇక ఆలస్యం చేయకుండా సినిమా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు. అందుకే కొరటాలను త్వరగా సినిమా స్టార్ట్ చేయాలని ప్రెజర్ తీసుకువస్తున్నాట్టు తెలుస్తోంది.

Also Read : Radhe Shyam Release : కొత్త రిలీజ్ డేట్ లాక్ చేసిన ప్రభాస్ టీమ్... రాధే శ్యామ్ కు వర్కౌట్ అవుతుందా..?

కొరటాల డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాను ముందు స్టార్ట్ చేసి... ఆరువాత రెండు మూడు నెలలకు బుచ్చిబాబు సినిమాను కూడా ఓపెనింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు తారక్. ఈరెండు కంప్లీట్ అయ్యాక.. ఈ ఏడాది చివరి కల్లా.. ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ ఎక్కించాలి అనుకుంటున్నాడు. మరి తారక్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా.. లేక  కరోనా ఈసారి కూడా యంగ్ టైగర్ ప్లానింగ్స్ పై నీళ్లు చల్లుతుందా అనేది చూడాలి.

 Also Read : AP Ticket Prices: శత్రువుకి శత్రువు మరి మిత్రుడేగా!

click me!