Radhe Shyam Pre Release event: నవీన్ పోలిశెట్టి అదిరిపోయే ఎంట్రీ.. రచ్చ రచ్చ చేసిన జాతిరత్నం

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 23, 2021, 08:46 PM IST
Radhe Shyam Pre Release event: నవీన్ పోలిశెట్టి అదిరిపోయే ఎంట్రీ.. రచ్చ రచ్చ చేసిన జాతిరత్నం

సారాంశం

దేశవ్యాప్తంగా రాధే శ్యామ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో రాధే శ్యామ్ ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో గ్రాండ్ గా రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.

దేశవ్యాప్తంగా రాధే శ్యామ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో రాధే శ్యామ్ ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో గ్రాండ్ గా రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పాన్ ఇండియా ఈవెంట్ గా గ్రాండ్ గా జరుగుతోంది. ప్రీ రిలీజ్ వేడుకకు అందాల యాంకర్ రష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. 

మరో సర్ ప్రైజ్ ఏంటంటే రష్మీతో పాటు జాతి రత్నం, యువ హీరో నవీన్ పోలిశెట్టికూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. వేదికపైకి ఎంట్రీ ఇవ్వగానే నవీన్ పోలిశెట్టి తన కామెడీ పంచ్ లతో రచ్చ షురూ చేశాడు. 

నవీన్ పోలిశెట్టి ఎంట్రీని వెరైటీగా ప్లాన్ చేశారు. జాతిరత్నం చిత్రంలోని పాట, సన్నివేశాలు ప్లే అవుతుండగా ఓ పెద్ద సింహాసనంపై నవీన్ పోలిశెట్టి ఎంట్రీ ఇచ్చాడు. తనదైన శైలిలో చిందులు వేస్తూ వేదిక కింద అతిథులుగా హాజరైన దర్శకులు నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా వద్దకు వెళ్ళాడు. వారిద్దరితో కలసి కాసేపు స్టెప్పులు వేశాడు. 

ప్రభాస్ అన్న జాతిరత్నాలు చిత్ర టైంలో మాకు ఎంతో సాయం చేశారు. ఆ రుణం తీర్చుకునే అవకాశం తనకు ఇలా వచ్చినందుకు సంతోషంగా ఉందని నవీన్ పోలిశెట్టి తెలిపాడు. ఈ క్రమంలో ప్రభాస్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దీనితో నవీన్ వెంటనే ప్రభాస్ వద్దకు వెళ్లి ఫ్యాన్స్ అందరికి హాయ్ చెప్పించాడు. 

Also Read: Allu Sneha: అల్లు అర్జున్ భార్యపై సమంత హాట్ కామెంట్స్.. బ్లాక్ శారీలో అల్లు స్నేహ గ్లామర్ మెరుపులు

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్
Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి