తనపై, తన కుటుంబంపై నటుడు నాగబాబు (nagababu) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్ధి మంచు విష్ణు (manchu vishnu). ఈసారి మా ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తినెలకొందని ఆయన అన్నారు. ఓడిపోతామనే భయంతోనే తనపై ప్రకాశ్ రాజ్ (prakash raj) ప్యానెల్ విమర్శలు చేసిందని మంచు విష్ణు మండిపడ్డారు.
తనపై, తన కుటుంబంపై నటుడు నాగబాబు (nagababu) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్ధి మంచు విష్ణు (manchu vishnu). ఈసారి మా ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తినెలకొందని ఆయన అన్నారు. ఓడిపోతామనే భయంతోనే తనపై ప్రకాశ్ రాజ్ (prakash raj) ప్యానెల్ విమర్శలు చేసిందని మంచు విష్ణు మండిపడ్డారు. నాగబాబు అంకుల్ ఎందుకు తనను విమర్శిస్తున్నారు.. నేను చేసిన తప్పేంటనీ ప్రశ్నించారు. తాను మీ కళ్లముందే పెరిగానని... నేనేంటో మీకు తెలుసునని విష్ణు చెప్పారు. అపోజిషన్ అభ్యర్ధి తనతో పాటు మా ఫ్యామిలీని కూడా అవమానిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ప్యానెల్లోని సీనియర్ నటి నాన్నగారిపైనా విమర్శలు చేశారని విష్ణు మండిపడ్డారు. నేను చేసే ప్రతి పనీ తప్పంటూ చిల్లరగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే వందల కోట్లు.. కిరీటాలు వచ్చేస్తాయా అని విష్ణు ప్రశ్నించారు. నాగబాబు అంకుల్ విమర్శించిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవి అంటే తనకు అభిమానమని.. మిమ్మల్ని విమర్శిస్తే చిరంజీవిని (chiranjeevi) అవమానించినట్లేనని విష్ణు తెలిపారు. తాను వరుణ్ (varun tej) లాంటి వాణ్ణేనని.. మీ బిడ్డలాంటి నన్ను ఎందుకు అంతలా విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ను (pawan kalyan) తిట్టిన వ్యక్తి ఇవాళ మీకు మేధావి అయిపోయాడా అని విష్ణు దుయ్యబట్టారు. అతని కన్నా నన్ను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మా ఎన్నికలపై (maa elections) నాగబాబు శుక్రవారం రాత్రి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్రాజ్ అని అన్నారు. ప్రకాశ్ రాజ్ కు (prakash raj) ఉన్న ప్రత్యేకతలు విష్ణులోలేవని.. ప్రకాశ్ రాజ్తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని నాగబాబు అన్నారు. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబు (mohan babu) కు తెలుసునని.. నటీనటులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్ రాజ్కే తెలుసునని మెగా బ్రదర్ కామెంట్ చేశారు. నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్కే కాదు మోహన్ బాబు కుటుంబానికి ఉన్నాయని నాగబాబు గుర్తుచేశారు.
సలీం చిత్రం విషయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే (yvs chowdary) మోహన్ బాబు అదోగతి పట్టించారని.. మోహన్ బాబుకు ఎదురు తిరగలేక ఎంతో మంది వెనుతిరిగారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ వివాదాల్లో తప్పెవరిదో తమకు తెలియదని.. ప్రకాశ్ రాజ్ వివాదాల్లో తప్పెవరిదో మీకు తెలియదని నాగబాబు అన్నారు. విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్, ఎక్కడ చదువుకున్నావ్.. మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు అని ఆయన దుయ్యబట్టారు. ప్రకాశ్ రాజ్, విష్ణు తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ని తెలుగోడంటారు.. విష్ణును తెలుగు నేర్చుకొమ్మంటారని, సినిమా జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్కే నా మద్దతు అని నాగబాబు మరోసారి తేల్చిచెప్పారు.
My Answer. https://t.co/NLZwiSpccl
— Vishnu Manchu (@iVishnuManchu)